తిరుమల, ఫీచర్స్ఇండియా : వేసవి సెలవులు మరి కొద్ది రోజుల్లో ముగియనుండగా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి గత వారం రోజులుగా తిరుమ లకు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి దాదాపు రెండు రోజులు పడుతోంది. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో టైమ్ స్లాట్ ద్వారా టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. సర్వదర్శనం విచ్చేసే భక్తులకు మరింత పారదర్శకంగా సేవలందించే క్రమంలో టైమ్ స్లాట్ విధానం తీసుకొ చ్చారు. తాజాగా టైమ్ స్లాట్ స్వర్వదర్శనం కౌంటర్లలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే మే 26 శనివారం తెల్లవారుఝామున 12.00 గంటల నుంచి, తిరుపతిలలో నిర్ణీత సంఖ్యలో టోకెన్లు జారీ చేయను న్నట్లు జెఈవో శ్రీనివాసరాజు తెలిపారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం జెఈవో మీడియాతో మాట్లాడుతూ క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్దేశిత సమయంలో స్వామివారి దర్శనం కల్పించేందుకు మే 3 నుంచి పూర్తిస్థాయిలో చేస్తునట్లు ఆయన తెలిపారు. గత వారం రోజులుగా అధిక రద్దీ కారణంగా మంగళవారం నుంచి తిరుమల లోని సర్వదర్శనం కౌంటర్లను తాత్కాలికంగా మూసి వేసినట్లు వివరించారు. అధికారులతో సమీక్షించిన అనంతరం శనివారం తెల్లవారుఝామున 12.00 గంటల నుంచి భక్తులు ఎంచుకున్న టైంస్లాట్లో నిర్ణీత సంఖ్యలో తిరు మల, తిరుపతిలోని అన్ని కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తున్నట్టు తెలియచేశారు. ఇందులో భాగంగా శని, ఆదివారాలలో 30 వేల టోకెన్లు, పోమ, శుక్రవారాలలో 20 వేల టోకెన్లు, మంగళ, బుధ, గురువారాలలో 17 వేల టోకెన్లు జారీ చేయనున్నాట్లు ఆయన వివరించారు. సర్వదర్శనం టోకెన్లు పొందలేని భక్తులు ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన లేపాక్షి సర్కిల్ నుంచి ప్రారంభ మయ్యే క్యూలైన్ ద్వారా ప్రవేశించి కంపార్టుమెంట్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకో వచ్చని జేఈఓ శ్రీనివాసరాజు తెలియజేశారు. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందే భక్తులు తమ వెంట ఆధార్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డులను తీసుకునిరావాలని జెఈవో సూచించారు.