అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చిత్రకారుల్లో ముఖ్యుడు… పాకాల
- 129 Views
- wadminw
- January 4, 2017
- Home Slider యువత
చిత్రకళా రంగంలో పి.టి.రెడ్డిగా చిరపరిచితుడైన పాకాల తిరుమల్ రెడ్డి అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చిత్రకారుల్లో ముఖ్యుడు. ఆరు థాబ్దాలుగా చిత్రకళారంగంలో అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు ఆయన. మరణించే వరకు కుంచెలను రంగరించిన తెలంగాణ చిత్రకారుడాయన. కరీంనగర్ జిల్లా అన్నారం గ్రామంలో 1915 జనవరి 4న జన్మించాడు. 1942లో బొంబాయి సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి చిత్రకళల మొది ర్యాంకుతో డిప్లొమా పొందాడు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలలోనే కాక ఆస్ట్రేలియా, యు.కె, జపాన్, పశ్చిమ జర్మనీ తదితర విదేశాల్లో సైతం చిత్రకళాప్రదర్శనలు నిర్వహించాడు.
ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ విశిష్ట సభ్యునిగా, కార్యదర్శిగా, అధ్యకక్షుడిగా అనేక హోదాల్లో పని చేసాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులెన్నో అందుకున్నాడు. హైదరాబాదు నారాయణగూడాలోని తన నివాసాన్ని ఒక పెద్ద చిత్రకళా ప్రదర్శనా నిలయంగా తీర్చిదిద్దిన పి.ి.రెడ్డి చిరస్మరణీయుడు. తెలంగాణ జీవితం, ఘర్షణ, పల్లెటూరు రైతు, చిక్కిన స్త్రీ, ఆందోళనలు అన్నీ కలిసిపోయిన రంగుల నైపుణ్యం ఆయనది. హైదరాబాద్, బొంబాయి వీధులు, ఆర్థిక, రాజకీయ, సాంఘిక ప్రభావాలు, మార్మిక, తాంత్రిక, శృంగార భావనల సమ్మిశ్రితం ఆయన కళ. కర్రతో, రాతితో ఆయన మలిచిన శిల్పాలు ప్రత్యేకం. 1996 అక్టోబర్ 21న ఆయన మరణించాడు. పి.ి.రెడ్డి భార్య ప్రముఖ రచయిత్రి పి.యశోదారెడ్డి.


