అందానికి ప్రతీకగా నిలిచే తూర్పు కనుమలు!
భారత ద్వీపకల్పానికి తూర్పు సముద్ర తీరం వెంట ఉండే కొండల వరుసనే తూర్పు కనుమలు అని పిలుస్తారు. పిలవడానికి కాస్త విభిన్నంగా ఉన్నప్పటికీ చూడ్డానికి మాత్రం ఈ ప్రాంతం కడుముచ్చటగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇవి ఉత్తరంగా పశ్చిమ బెంగాల్ నుండి, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ ద్వారా దక్షిణంగా తమిళనాడు రాష్ట్రాలలోనికి వ్యాపించాయి. ఇవి మహానది, గోదావరి, కృష్ణా నది, కావేరి నదుల ప్రవాహం వలన వేరుచేయబడ్డాయి. ఇవి బంగాళఖాతం సముద్రానికి సమాంతరంగా వ్యాపించాయి.
వీని మధ్య ప్రదేశాన్ని కోస్తా ప్రాంతం అంటారు. దక్కను పీఠభూమి తూర్పు, పడమర కనుమల మధ్యగా విస్తరించి ఉంది. పడమటి కనుమల కన్నా తూర్పు కనుమల ఎత్తు తక్కువగా ఉంటాయి. దక్షిణ బాగాన తూర్పు కనుమలు విడిపొయి చిన్న చిన్న పర్వత శ్రేణులుగా విస్తరించి వుంటాయి. తూర్పు కనుమల దక్షిణ చివరి భాగం తమిళనాడులోని సిరుమలై, కరన్ తమలై అనె పర్వతశేణితో ముగుస్తుంది. కావేరి నది ఉత్తరాన కొల్లి హిల్స్ (కొల్లమలై), పంచమలై హిల్ల్స్ షెవరోయ్ హిల్స్, సెర్వరోయన్, కల్ రాయన్ హిల్స్, చిత్తేరి, పల్లమలై, మెత్తుర్ హిల్స్ అనె ఎత్తైన పర్వతాలు (తూర్పు కనుమలు) ఉత్తర తమిళనాడులో విస్తరించి ఉన్నాయి.
ఇక్కడ కొండలు పైన ఉష్ణోగ్రతలు చుట్టు ప్రక్కల ప్రదేశాల కంటే చల్లగాను తేమగాను వుంటాయి. ఈ ప్రదేశాల్లో కాఫీ తోటలు, అడవులు ఉంటాయి. యార్కడ్ షెవరాయ్ కొండలలో ఉంది. బిల్గిరి కొండలు పశ్చిమ కనుమలు నుండి కావేరి నది వెంబడి తూర్పు కనుమలను కలుస్తాయి. తూర్పు మరియు పశ్చిమ కనుమలు మధ్య ఈ ప్రాంతం ఒక జీవ వైవిధ్య మనోహర ప్రదేశంగా భాసిల్లుతున్నది. అలాగే భారత దేశంలో ఏనుగుల సంచారం కలిగిన రెండవ అతి పెద్ద ప్రాంతంగా ఉంది. పొన్నాయర్, పలర్ నదులు కర్నాటకలోని కోలార్ పీఠభూమి నుండి తూర్పున బంగాళాఖాతంలో కలుస్తాయి, తూర్పు కనుమలలో భాగమైన జవధు కొండలు ఈ రెండు నదుల మధ్య ఉన్నాయి.
ఈ కొండలలో కిలియుర్ జలపాతం కలదు. పలర్ నదికి ఉత్తరాన ఆంధ్రప్రదేశ్లో తూర్పుకనుమల మధ్య భాగం ఉంది. ఇవు రెండు సమాంతర కొండలుగా ఉన్నాయి. ఒకటి వెలికొండ రేంజీ కాగా మరొకటి పాలికొండ-లంకమల్ల-నల్లమల రేంజి. వెలికొండ రేంజి నెల్లూరు వైపుగా కోస్తా ప్రాంతంలో ఉంటుంది. నల్లమల కొండలు కృష్ణా నది వెంబడి ఏర్పడ్డాయి. కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో ఈ కొండలు తక్కువ ఎత్తులో ఉంటాయి, గోదావరి నది ఉత్తర బాగాన తూర్పు కనుమలు ఎత్తుగా ఉంటాయి. ఈ ప్రాంతం అంతా సారవంతమైన భూమి కలిగి ఉంది. పశ్చమ కనుమలలో లాగ ఇక్కడ జలవిద్యుఛ్చక్తికి అనువైనది కాదు.
తూర్పు కనుమలు పశ్చమ కనుమల కన్నా పురాతనమైనవి. ఇవి రెండు ఖండాలు విడిపోయినప్పూడు ఏర్పడినవి. (రోడినియా, గోండ్వాణ) తూర్పు కనుమలలో అనేక భౌగోళిక అద్భుత ప్రాంతాలు ఉన్నాయి. గొప్పగా చెప్పాల్సి వస్తే తూర్పు కనుమల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాలలో ముఖ్యమైనది పాడేరు ఫారెస్టే. ఎందుకంటే చూపరులను అమితంగా ఆకట్టుకునే అతికొద్ది ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. పాడేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక గ్రామం. మండల కేంద్రం, డివిజన్ కేంద్రం కూడానూ.
పాడేరు సుందర అటవీ ప్రాంతం. ఈ అందమైన ప్రాంతం ఆక్రమణలతో అంతరించి పోతున్నదని పత్రికలలో రాసారు. కొన్ని కొండజాతులు తండాలు ఈఅడవి జీవనదారంగా జీవిస్తున్నాయి. పాడేరు అభయారణ్యంలో దొరికే జీలుగు, కుంకుళ్ళు, సీమచింతకాయలు, కట్టెలు లాంటివి దగ్గరలోని పట్టణాలలో అమ్మి జీవిస్తుంటారు. ఈ ప్రాంతంలోగల మోదకొండమ్మ ఆలయం బహుప్రసిద్దం. ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తే శుభం జరుగునని గొప్ప విశ్వాసం.


