అక్కినేని వారసుడిగా కాకుండా…
నాగ చైతన్య… నాగార్జున కొడుకుగానే కాకుండా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, లక్ష్మి (నటుడు వెంకటేష్ సోదరి)ల తనయుడు. ఇతడు జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించాడు. కానీ ఆ చిత్రం ఆశిందగ్గ పలితాన్ని ఇవ్వలేదు, కానీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఏ మాయ చేసావే ద్వారా మంచి విజయాన్ని నమోదు చేశాడు. నాగ చైతన్య నటించిన మొదటి సినిమా దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన జోష్.
ఈ సినిమాతో ప్రముఖ నటి రాధ కూతురు కార్తీక నటిగా పరిచయమైంది. ఈ సినిమా ఆశించదగ్గ విజయం సాధించనప్పటికీ, చైతన్యకు ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్, నంది అవార్డులను పొందాడు. కానీ 2010లో తను అతిథి పాత్రలో నటించిన విన్నైతాండి వరువాయా సినిమా తెలుగు పునః నిర్మాణం ఐన ఏ మాయ చేశావే తనకు మొదటి భారీ విజయాన్ని అందించింది. గౌతం మీనన్ దర్శకత్వంలో సమంత కథానాయికగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో చైతన్య తన నటనకు విమర్శకులనుంచి ప్రశంసలందుకున్నాడు. నేటికీ తెలుగు సినిమాల్లోని ఎన్నో క్లాసిక్స్లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది.
ఈ సినిమాకి చైతన్యకు ఉత్తమ నటుడికి గాను నాటి ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత 2011లో సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాలో నటించాడు. ఇందులో తమన్నా కథానాయిక. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత అజయ్ భుయాన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా తెరకెక్కిన తన చిత్రం దడ, వివేక్ కృష్ణ దర్శకత్వంలో అమలా పాల్ కథానాయికగా తెరకెక్కిన బెజవాడ సినిమాలు పరాజయాన్ని చవిచూసాయి. ప్రస్తుతం చైతన్య దేవ కట్ట దర్శకత్వంలో సమంత సరసన ఆటోనగర్ సూర్య, కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో సునీల్, తమన్నా, ఆండ్రియా సరసన తడాఖా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మనం, వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మరో సినిమాలో చైతూ నటించి మెప్పించాడు.
హైదరాబాద్లో జన్మించిన నాగ చైతన్య తన తల్లిదండ్రులు విడిపోయాక చెన్నైకి వెళ్ళిపోయాడు. పీ.ఎస్.బీ.బీ. స్కూల్లో చదువుకున్నప్పుడు చైతన్య తన తండ్రి నాగార్జున, తన పిన్ని అమలతో సఖ్యతగా ఉండేవాడు. తన స్కూల్ బ్యాండ్లో అప్పుడప్పుడూ గిటార్ వాయించేవాడు. ముంబైలో, కాలిఫోర్నియాలోని స్టూడియోలో నటనలో శిక్షణ పొందాడు. నేటికి కూడా చైతన్య తనకు కార్లమీద ఉన్న అభిమానంతో కారు రేసుల్లో పాల్గుంటాడు. 100% లవ్ సినిమా విడుదలైన కొత్తల్లో తనకీ, ప్రముఖ నటి అనుష్కకి నిశ్చితార్థం జరిగిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే వాటిని వదంతులని నాగార్జున, చైతన్య, అనుష్కలు తేల్చి చెప్పారు.


