ఆధ్యాత్మిక ప్రవచనాలకు పెట్టింది పేరు ఉషశ్రీ
ఉషశ్రీ… ఆయన అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో 1928 (ప్రభవ తెలుగు సంవత్సరం) సంవత్సరం మార్చి 16 (ఫాల్గుణ బహుళ త్రయోదశి)న జన్మించారు. తండ్రి పురాణపండ రామూర్తి. తండ్రి ఆయుర్వేద వైద్యుడు, తల్లి కాశీ అన్నపూర్ణ. జాతీయోద్యమ సమయంలో కాకినాడలో కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా పనిచేశారు. ఆ తరువాత పురాణపండ రామూర్తి ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వేదికల మీద రామాయణం, మహాభారతం మహాభాగవతం ప్రవచనం చేశారు. ఉషశ్రీ ఆకాశవాణి విజయవాడ కేద్రంలో అనేక సంవత్సరాలు పని చేశారు. ఆ కాలంలో ఆయన నిర్వహించిన ధర్మ సందేహాలు కార్యక్రమం చాలా పేరు పొందింది.
ఆ తరువాత వారం వారం రామాయణ మహా భారతాలను ఆకాశవాణి నుండి ప్రవచనం చేశారు. 1973లో రేడియోలో భారత ప్రవచనం ప్రారంభించారు. అప్పట్లో దూరదర్శన్ లేదు. ఉషశ్రీ పురాణ ప్రవచనాలు వారానికి ఒకసారి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేది. శ్రోతలు రేడియోల ముందు మూగేవారు. ఆ అరగంటసేపు బయట ప్రపంచాన్ని మరచి ఆ పురాణ గాధలలో మునిగి తేలేవారట. ఈ విధంగా ప్రఖ్యాతి గాంచిన రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచరుత. ఉషశ్రీ తన రామాయణ భారత ప్రవచనాల ద్వారా తెలుగునాట అందరికీ సుపరిచితులు. ఆప్పట్లో ఆయన గొంతుని, మాట సరళిని గుర్తు పట్టలేని తెలుగు శ్రోత లేరంటె అది అతిశయోక్తి కాబోదు.
భీమవరంలో డిగ్రీ పూర్తి కాబోయే సంవత్సరంలో ఆయన మిత్రుడైన రామానుజాచార్యులు ఆయనచే పునర్జన్మ అనే నాటకంలో ఒక పాత్ర వేరుంచారు. అందులో ఉషశ్రీ తండ్రి పాత్ర పోషించగా రామానుజాచార్యులు విలన్ పాత్ర పోషించారు. 1979లో పి.వి.ఆర్.కె ప్రసాద్ తి.తి.దేకి కార్యనిర్వహణాధికారిగా ఉన్నపుడు ఆయనచే భాగవతం రారుంచి పాతికవేల కాపీలు ముద్రింపజేసి అతి తక్కువ ధరలో భక్తులకు అందించారు. అరుతే ఆయన రెండున్నర రూపాయలకు విడుదల చేసిన పుస్తకాన్ని తరువాత వచ్చిన వారు తొమ్మిది రూపాయలు చేశారు. భారతం, రామాయణాలు కూడా పదివేల ప్రతులు ముద్రించి కృష్ణా పుష్కరాల సమయంలో విడుదల చేశారు.


