క్రికెట్లో రికార్డులు పరంపర సృష్టించిన కిరణ్ శంకర్ మోరే
సెప్టెంబర్ 4న గుజరాత్లోని బరోడాలో జన్మించిన కిరణ్ శంకర్ మోరే 1984 నుంచి 1993 వరకు భారత క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్గా పనిచేశాడు. 2006 వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెలెక్షన్ కమీటీకి చైర్మన్గా వ్యవహరించాడు. ఇతని తర్వాతనే బీసీసీఐకు ప్రస్తుతం దిలీప్ వెంగ్సర్కార్ నేతృత్వం వహిస్తున్నారు. కిరణ్ మోరే ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లీగ్ తరఫున పనిచేస్తున్నారు. మోరే 1970 ప్రాంతంలో అండర్-19 తరఫున క్రికెట్ ఆడారు. ముంబారులో టైమ్స్ షీల్డ్లో టాటా స్పోర్ట్స్ తరఫున 1982లో నార్త్ లాంకషైర్లో బారో తరఫున ఆడారు.
1982-83లో వెస్ట్ఇండీస్ పర్యటనకు వెళ్ళినప్పటికీ టెస్ట్ క్రికెట్లో తలపడే అవకాశం రాలేదు. మోరే 1983-84 రంజీ ట్రోఫిలో బరోడా తరఫున రెండు మంచి ఇన్నింగ్సులను ఆడారు. మహారాష్ట్రపై 153, ఉత్తరప్రదేశ్పై 181 పరుగులు సాధించారు. ఆ తర్వాత అతను చివరి వికెట్కు వాసుదేవ్ పటేల్తో కల్సి 145 పరుగులు జోడించాడు. దశాబ్దం వరకు ఇది రంజీ రికార్డుగా కొనసాగింది. 1984-85లో మోరే ఇంగ్లాండుపై రెండు వన్డే మ్యాచ్లు ఆడే అవకాశం లభించింది. 1985-86లో భారత జట్టులో సభ్యుడిగా ఆస్ట్రేలియా పర్యటించాడు.
ప్రపంచ సీరీస్ కప్లో సయ్యద్ కిర్మాణి గాయపడటంతో మోరేకు అవకాశం లభించడం, కిర్మాణికి క్రీడాజీవితపు అంతిమ ఘడియలు సమీపించడం జర్గారు. ఆ టోర్నెమెంటులో మిగితా మ్యాచ్లకి మోరే వికెట్ కీపింగ్ చేశాడు. అది మొదలుకొని 1993 వరకు మోరేకు వికెట్ కీపింగ్లో ఎదురులేదు, పోటీలేదు. వన్డే క్రికెట్లో మాత్రం అతనికంటే చక్కగా బ్యాటింగ్ చేసేవారితో పోటీ ఎదురై తన స్థానాన్ని కోల్పోయాడు. టెస్ట్ క్రికెట్లో మోరే 1986లో ఇంగ్లాండుతో జరిగిన తొలి సీరీస్లోనే మంచి ప్రతిభను కనబర్చినాడు. 3 టెస్టులు కల్పి 16 క్యాచ్లు పట్టి ఇంగ్లాండుపై ఒక భారతీయ కీపర్గా రికార్డు స్థాపించాడు. బ్యాటింగ్లో కూడా అతను సగటులో రెండో స్థానంలో నిల్చాడు.
రెగ్యులర్ బ్యాట్స్మెన్లు విఫలమైన సందర్భాలలో కూడా మోరే ఉత్తమ ఇన్నింగ్స్ ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 1988-89లో వెస్ట్ఇండీస్పై భారత్ 63 పరుగులకే 6 వికెట్లు కోల్పోరున పరిస్థితిలో బ్యాటింగ్ చేసి 50 పరుగులు సాధించాడు. అలాగే అదే సంవత్సరంలో పాకిస్తాన్పై ఆడుతూ కరాచి టెస్టులో భారత్ ఫాలొఆన్ ప్రమాదంలో ఉన్న పరిస్థితిలో విలువైన 58 పరుగులు చేసి నాటౌట్గా నిల్చాడు. కాబట్టి కరాచి ఇన్నింగ్స్ అతని క్రీడాజీవితంలో అత్యుత్తమమైనదని చెప్పవచ్చు. 1988-89లో వెస్ట్ఇండీస్తో జరిగిన మద్రాసు టెస్ట్లో ఆరుగురిని స్టంప్ ఔట్ చేయడం, అందులోనూ ఐదుగురిని రెండో ఇన్నింగ్సులో చేసి టెస్ట్ రికార్డు సృష్టించాడు.
1990లో న్యూజీలాండ్ పర్యటించిన అజహరుద్దీన్ నేతృత్వంలోని భారత జట్టుకు ఉప సారథిగా నియమించబడ్డాడు. నేపియర్లో జరిగిన రెండో టెస్టులో 73 పరుగులు చేసి అతని అత్యుత్తమ స్కోరును నమోదుచేసుకున్నాడు. తర్వాత ఇగ్లాండు పర్యటించిన భారత జట్టుకు ఉప సారథి కిరీటం రవిశాస్త్రికి వదలిపెట్టాల్సి వచ్చింది. లార్డ్స్ టెస్టులో ఓపెనర్ గ్రాహం గూచ్ 36 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్ను మోరే వదలిపెట్టడంతో చివరికి గూచ్ 333 పరుగుల మహా ఇన్నింగ్స్ ఆడినాడు.
1994 ప్రారంభంలో బరోడాకే చెందిన మరో వికెట్ కీపర్ నయన్ మోగియా వల్ల మోరే భారత జట్టులో స్థానం కోల్పోయాడు. బరోడా తరఫున మోగియా కూడా ఆడే పరిస్థితి వచ్చినప్పుడు మోరే కేవలం బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడేవాడు. 1998 వరకు మోరే బరోడా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. 1987 కిరణ్ మోరే క్రికెట్ అకాడమీని స్థాపించాడు. 2002 నుంచి 2006 వరకు అతడు సెలెక్షన్ కమిటీ చైర్మెన్గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఆ స్థానం దిలీప్ వెంగ్సర్కార్కు వదిలి తను జీ టెలివిజన్ స్థాపించిన ఇండియన్ క్రికెట్ లీగ్ వైపు మొగ్గుచూపాడు.


