జనసేన నేతలకు బెయిల్
- 81 Views
- admin
- October 21, 2022
- తాజా వార్తలు రాష్ట్రీయం
విశాఖపట్నం విమానాశ్రయంలో ఏపీ మంత్రులు, వైసీపీ మంత్రులపై జరిగిన దాడి ఘటనలో అరెస్టైన జనసేనకు చెందిన 9 మంది నేతల బెయిల్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు… 9 మంది నేతలకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విశాఖ జైల్లో ఉన్న జనసేన నేతలు కోర్టు ఆదేశాలు అందగానే విడుదల కానున్నారు. ఇదిలా ఉంటే… జనసేన నేతలకు బెయిల్ లభించడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జనసేన నేతలపై ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని ఆయన ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు మొత్తంగా 70 మందిని అరెస్ట్ చేయగా… వారిలో 61 మందికి స్థానిక కోర్టే బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన 9 మందిపై మోపిన అభియోగాలు తీవ్రమైనవి కావడంతో వారికి బెయిల్ లభించలేదు. తాజాగా 9 మంది జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించగా… వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Categories

Recent Posts

