తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
- 99 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
తిరుపతి, సెప్టెంబర్ 6 (న్యూస్టైమ్): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం మంగళవారం భక్తులు తిరుమల కొండకు సాధారణ స్థాయిలో చేరుకున్నారు. దీంతో స్వదర్శనం కోసం భక్తులు 8 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం 4 గంటల్లోపు స్వామి దర్శనం కలుగుతోంది. 50 సుదర్శనం, 300 ఆన్లైన్ భక్తులకు గంట సమయంలో దర్శనం లభిస్తోంది. కాలిబాటన అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గంలో వచ్చే దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయంలో స్వామి దర్శనం కలుగుతోంది. సోమవారం ఉదయం 5 గంటల నుండి మంగళవారం ఉదయం 5 గంటల వరకు 74,308 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
కేంద్రీయ విచారణ కార్యాలయం, టీజీసీ, కౌస్తవం ఎంబీసీ 34, పద్మావతి అతిథి గృహం, సన్నిదానం, గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. కల్యాణకట్ట, నిత్యాన్నప్రసాద సముదాయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కాగా, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సోమవారం వేకువజాము నుండి రాత్రివరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుని సమర్పించిన కానులను ఆలయంలోని పరకమణిలో లెక్కింపులు నిర్వహించారు. దీంతో శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కింపులు నిర్వహించగా సుమారు రూ.2.77కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు సమకూరినట్లు అధికారులు తెలిపారు.


