నాటి మేటి గీతాల మధుర కంఠం… పీబీ శ్రీనివాస్ సొంతం!
సినీ పరిశ్రమలో పి.బి.శ్రీనివాస్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన పేరు చెబితే, మధుర గీతాలు దగ్గర నుంచి విషాద బాణీలు వినిపిస్తారు. ఆయన పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్. ఆయన ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు. తన మాతృభాష అరున తెలుగులో కంటే కన్నడ, తమిళ చిత్రాలలో ఎక్కువ పాటలు పాడారు శ్రీనివాస్. ఆయన హిందీ, మలయాళం చిత్రాలలో కూడా పాటలు పాడారు. కన్నడ నటదిగ్గజం రాజ్కుమార్కు ఈయన ఎన్నో గీతాలు ఆలపించారు. ఆయన తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్ల, సంస్కృత భాషలలో దిట్ట. ఈయన ఎన్నో గజళ్లు రాసారు. ఆయన గళం సువర్ణ గళంగా గుర్తింపు పొందింది.
ఈయన మొట్టమొదటిసారిగా జాతక ఫలం చిత్రంలో పాడారు. ఆయన సుమారు 3000లకు పైగా పాటలు పాడాడు. ఆయన ఆంధ్రపదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు సెప్టెంబర్ 22, 1930న జన్మించారు. ఆయన కళాశాల చదివి బి.కాం. డిగ్రీని సంపాదించారు. ఆయన పూర్వీకులు పసలపూడి గ్రామానికి చెందినవారు. ఆయన ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. అవి తెలుగు, కన్నడం, తమిళం, మళయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, సంస్కృతం. ఆయన అనేక గజళ్లను తెలుగులో పాడారు. శ్రీనివాస్ యుగళ గీతాలను కోరస్ పాటలను గీతా దత్, షంషాద్ బేగమ్, జిక్కీలతో కలిసి ఆలపించారు.
ఆయన ఆర్.నాగేంద్రరావు జాతక ఫలం అనే చిత్రం ద్వారా తమిళం, కన్నడం, తెలుగు చిత్రాలలో పరిచయమయ్యారు. ఆయన దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడారు. తెలుగు చిత్రాల్లొ ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను తన మధుర గాత్రంతో ఆలపించారు. శాంతినివాసం చిత్రంలో మహానటుడు నాగయ్యకి శ్రీ రఘురాం జయ రఘురాం అనే పాటను పాడటం విశేషం. శ్రీనివాస్ 1952లో జెమిని వారి హిందీ చిత్రం మిస్టర్ సంపత్తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించారు. అందులో ఆయన పాడిన పాట ఆజి హం భారత్ కీ నారి ఒక యుగళ గీతం. దీనిని గీతా దత్త్తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందారు.
1955లో మళయాళ చిత్రం హరిశ్చంద్రలో పాడారు. ఆయన మొదటి సోలో సాంగ్ ప్రేమ పాశం చిత్రంలో పి.సుశీలతో పాడారు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవ రాజ్కుమార్కు చాలా కాలం పాటు పాటలు పాడారు. ఇవి విమర్శకులచే, అభిమానులచే, పరిశ్రమలచే కొనియాడబడ్డారు. తమిళ పరిశ్రమలో జెమిని గణేశన్కు అనేక పాటలు పాడారు. ఆయన పాటలలో ప్రముఖమైనది నిలవే ఎన్నిదం నెరుంగతె. ఆయన ఇతర నటులకు కూడా అనేక సందర్భాలలో పాటలు పాడారు. ముఖ్యంగా కొన్ని పాటలను ఎం.జి.రామచంద్రన్, శివాజీ గణేశన్లకు పాడారు. 1964లో మై భీ లడకీ హూ అనే హిందీ చిత్రంలో లతా మంగేష్కర్తో కలిసి పాడిన పాట చందా సె హోగా వో ప్యారా ఎంతో విశేషతను పొందింది. ఆయన కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది.
వారు జెమినీ గణేశన్, ముత్తురామన్, రవిచంద్రన్, జైశంకర్. పావా మనిప్పు అనే చిత్రంలో కన్నదాసన్ రాసిన కలగాలి ఆవల్ వసంతమ్ అనే పాటను ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి సంగీత సారథ్యంలో పాడారు. అంజలీ పిక్చర్స్ వారి ఆడుతా వీట్టుప్పెన్ అనే చిత్రంలో కొన్ని పాటలు పాడారు. శ్రీనివాస్ ప్రముఖ గాయనీమణులైన పి.సుశీల, ఎస్.జానకి, పి.భానుమతి, కె.జమునా రాణి, ఎల్.ఆర్.ఈశ్వరి లతా మంగేష్కర్ల సరసన పాడారు. ఆయన ఆధ్యాత్మిక పాటలను కూడా పాడారు. అవి శారదా భుజంగ స్తోత్రం, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్, ముకుంద మాల, శ్రీ మల్లిఖార్జున స్తోత్రం, పురందరదాసు సంకీర్తనలు. చైన్నైలోని ఆయన ఉంటున్న వుడ్లాండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్లో ఏ సమయంలో ఆయనను సందర్శించినా ప్రశాంతంగా కవితలు రాసుకుంటుండేవారు. పి.వి.శ్రీనివాస్ ఏప్రిల్ 14, 2013లో తన 82 వయేట చెన్నైలోని ఆసుపత్రిలో గుండె పోటుతో అస్తమించారు.


