నాడు అమరావతి రాజధానిని వ్యతిరేకించా !
- 64 Views
- admin
- November 7, 2022
- తాజా వార్తలు రాష్ట్రీయం
నాడు ఏపీ రాజధానిని అమరావతిలో కట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందా? లేదంటే మూడు రాజధానులు ఏర్పడతాయా? అన్న విషయం తనకు తెలియదన్నారు. ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందనేది సుప్రీంకోర్టులో తేలుతుందని ఆయన అన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం అంటే నాడు రైతులు కూడా ఒకింత వ్యతిరేకతతోనే ఉన్నారన్నారు. అయితే నాడు విపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతికి మద్దతు ఇచ్చారన్నారు. అమరావతికి జగన్ మద్దతు ఇవ్వడంతో అక్కడి రైతులు ధైర్యంగా తమ భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చారని ఉండవల్లి తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.


