పార్లమెంట్లో హైదరాబాద్ మాజీ మేయర్ కలకలం
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి పార్లమెంట్ ప్రాంగణంలో బుధవారం కలకలం సృష్టించారు. ఎంపి పాస్పై పార్లమెంట్ సెషన్కు ఆమె వెళ్లారు. గ్యాలరీ నుంచి సమావేశాలను వీక్షించారు. ఆ తర్వాత లోక్సభ గురువారం నాటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
అయితే అనూహ్యంగా అక్కడ కార్తీక ప్రత్యక్షమయ్యారు. భద్రతావలయాన్ని ఛేదించుకుని రాహుల్ వద్దకు కార్తీక రావడంతో, అధికారులు అప్రమత్తం అయ్యారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆమెపై చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. జరిగిన ఘటనపై పార్లమెంట్ సెక్యూరిటీ విచారణ చేపట్టారు.
Categories

Recent Posts

