పెంకుటిల్లు నవలా రచరుత… కొమ్మూరి
కొమ్మూరి వేణుగోపాలరావు… ప్రసిద్ధిచెందిన తెలుగు రచరుత. ఇతడు పెంకుటిల్లు నవలా రచరుతగా ప్రసిద్ధుడు. ఇతడు బెంగాలు రచరుత శరత్ చంద్ర ప్రభావానికి గురై తెలుగులో చాలా రచనలు చేశారు. ఇతడు ఆంధ్రా శరత్గా గుర్తింపు పొందారు. ఇతడు సుమారు 50 పైగా నవలలు రచించారు. వీరి రచనలు ఎక్కువగా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా ఉంటారు. వీనిలో హౌస్ సర్జన్, హారతి, వ్యక్తిత్వం లేని మనిషి నవలలలోని పాత్రలు ఉదాహరణలుగా నిలుస్తారు. వీరి ప్రేమ నక్షత్రం నవల సినిమాగా వచ్చింది.
1959లో గోరింటాకు సీరియల్గా వచ్చి యువకుల్ని బాగా ఆకర్షించింది. ఈయన ఆకాశవాణి కోసం ఎన్నో నాటికలు రచించారు. ఇవి కాకుండా కొన్ని మంచి కథలు కూడా రచించారు. వాటిలో మర మనిషి కథను నేషనల్ బుక్ ట్రస్ట్ అన్ని భాషలలోకి అనువదించి ప్రచురించింది. తెలుగులో గొలుసు నవల అనే కొత్త ప్రక్రియను పురాణం సుబ్రహ్మణ్య శర్మ, గొల్లపూడి మారుతీరావు వంటి వారితో కలిసి మొదలుపెట్టారు. దీనిని ఇడియట్ అనే పేరుతో ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1968లో ధారావాహికగా ప్రచురించారు. వేణుగోపాలరావు విజయవాడలో 1935 సెప్టెంబరు 4న జన్మించారు. కొమ్మూరి సెక్స్ ఎడ్యుకేషన్ కలిగించడానికి సృష్టి రహస్యాలు (1980) అనే సినిమాను నిర్మించారు. ఈయన 2004 అక్టోబరు 31న పరమపదించారు.


