ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోంది
- 39 Views
- admin
- May 5, 2023
- తాజా వార్తలు
మా ప్రభుత్వం (వైసీపీ ప్రభుత్వం) విపరీతంగా అప్పులు చేస్తోందని ఎంపీ, వైసీపీ తిరుగుబాటు నేత రఘురామ కృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. జనం ప్రస్తుతం బాధల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో జగన్ ఇంట్లో ఉంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం అదే జనాల్లో ఉన్నారని ప్రశంసించారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఏమవుతుందో అర్థం కావడం లేదన్నారు. పెళ్లి కానుక లేదా షాదీ తోఫాకు పదో తరగతి పాస్ నిబంధన ఏమిటో అర్థం కావడం లేదన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి మీడియా యాజమాన్యాన్ని ప్రశ్నించాలని రఘురామ కృష్ణరాజు శుక్రవారం డిమాండ్ చేశారు.
Categories

Recent Posts

