భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చు
కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఇది సవాళ్లతో కూడుకున్న సమయం అని సోనియా అన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్లు దేశంలో అన్ని సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. కొంత మంది వ్యాపారవేత్తలకు మద్దతు ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లు చెప్పారు. 2004, 2009లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మనం సాధించిన విజయాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. ఇంకా సంతోషించే విషయం ఏంటంటే.. భారత్ జోడో యాత్రతోనే నా రాజకీయ ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చు. కాంగ్రెస్కు ఇదో కీలక మలుపు అవుతుండొచ్చు’’ అని సోనియా కీలక వ్యాఖ్యలు చేశారు. సామరస్యం, సహనం, సమానత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నట్లు భారత్ జోడో యాత్రతో తెలిసిందని సోనియా అన్నారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చని చెప్పారు.
Categories

Recent Posts

