మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట
- 71 Views
- admin
- November 7, 2022
- తాజా వార్తలు రాష్ట్రీయం
ఏపీ రాజధాని అమరావతి పరిధిలో నిర్మించతలపెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ను అప్పటి మంత్రి హోదాలో పొంగూరు నారాయణ ఉద్దేశపూర్వకంగా మార్చారని, తన వారికి మేలు చేసేందుకే ఆయన ఈ పని చేశారంటూ ఏపీ సీఐడీ ఓ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీఐడీ అధికారులు చర్యలు మొదలుపెట్టకముందే నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వైద్య చికిత్సల నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి ఉందని, ఈ క్రమంలో అమరావతి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును కోరగా… కోర్టు అందుకు సానుకూలంగా స్పందించి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే నారాయణకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా ప్రతి చిన్న విషయానికి సుప్రీంకోర్టు తలుపు తడితే ఎలా? అంటూ ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములను చేయొద్దని కూడా ఏపీ సర్కారుపై కోర్టు కీలక వ్యాఖ్యులు చేసింది. నారాయణ ముందస్తు బెయిల్ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.


