సత్సంగం… వివాదం… అదే జీవితం!
జోధ్పూర్, సెప్టెంబర్ 22: సంత శ్రీ అసరామ్జీ బాపూ… ఒక ఆధ్యాత్మిక గురువు. ఇతని అనుచరులు సాధారణంగా ఇతనిని ‘బాపూజీ’ అని పిలుస్తారు. బాపూజీ దేశ విదేశాలలో విస్తృతంగా పర్యటనలు జరిపారు. సత్సంగ, యోగ , వేదాంతం, భక్తి, ముక్తి వంటి విషయాల గురించి బోధిస్తారు. 1993లో ప్రపంచ మతాల పార్లమెంటులో గ్లోబల్ మతాల అసెంబ్లో కమిటీ సభ్యునిగా ఉన్నారు. అనుభవజ్ఞులు, యువకులు, ముసలివారు, భాగ్యవంతులు మరియు పేదవారు, నాస్తికులు వంటి విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులు బాపుజి సత్సంగకి వస్తుంటారు. కొందరు భక్తి. ధ్యానం వంటి విషయాలపై ఆసక్తి చూపుతారు. మరికొందరు తమ సమస్యలు, వ్యాధుల గురించి సలహాలు, ఓదార్పులు ఆశిస్తారు. బాపూజీ ప్రసంగాలు అందరికీ ఎంతో ప్రశాంతత చేకూరుస్తాయని అనుచరులు అంటారు.
అధికంగా బాపూజీ భక్తి యోగం, జ్ఞాన యోగం, కర్మ యోగం గురించి వివరిస్తారు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్లోని జోధ్పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపించింది. లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశారామ్పై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన రాజస్థాన్లో జరిగినట్లు బాధితురాలు పేర్కొన్నందున కేసును అక్కడికి బదిలీ చేస్తామని చెప్పారు. మరోవైపు ఈ ఆరోపణలను ఆశారామ్బాపూ ఆశ్రమ ప్రతినిధి నీలమ్ దూబే తోసిపుచ్చారు. ఆశారామ్ ప్రతిష్టను దిగజార్చేందుకు కొందరు ఈ తప్పుడు కేసు పెట్టించారని ప్రత్యారోపణ చేశారు.
పోలీసు దర్యాప్తు మొదలైతే ఈ కేసు వెనక ఎవరున్నారో తేలుతుందన్నారు. ఆశారామ్ బాపూపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 2009లో ఆయనపై హత్యాయత్నం, భూకబ్జా కేసులు నమోదవగా మధ్యప్రదేశ్లోనూ భూకబ్జా కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాదాభివందనం చేసేందుకు వచ్చిన ఓ భక్తుడిని ఆశారామ్ దుర్భాషలాడుతూ కాలితో తన్నారు. 2012లో ఓ వీడియో జర్నలిస్టు చెంప చెళ్లుమనిపించారు. 2008లో గుజరాత్లో ఆశారామ్కు చెందిన ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ఆశారామ్ ఆశ్రం దగ్గర పని చేసే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి అరెస్టయ్యాడు.
దేశంలోనే ఆధ్యాత్మిక గురువుల్లో ప్రముఖుడిగా పేరున్న ఈ స్వామి ఆధ్యాత్మికం ముసుగులోచేస్తున్న అరాచకాలివి. మనవరాలి వయసున్న మైనలర్ బాలికనే తన కామవాంఛను తీర్చుకునే యత్నం చేశాడు. రాజస్థాన్ జోధ్ పూర్లోని ఆశారం బాపూ ఆశ్రమంలోనే ఈ ఘటన జరిగిందని ఆ బాలిక స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆశారామ్ కోసం చాలా రోజులుగా గాలించి చివరికి కటకటాల వెనక్కినెట్టారు. ఆ తర్వాత ప్రస్తుతం ఆయన జైలు జీవితాన్ని రిమాండు ఖైదీ హోదాలో అనుభిస్తున్నారనుకోండి. అరెస్టుచేసే క్రమంలో ఆశారాం అనుచరులు పోలీసులు, మీడియాపైనా దాడికి పాల్పడ్డారు.
ఆశారాం బాపూ అనుచరుల దాడిలో నేషనల్ మీడియా కెమేరామేన్లకు తీవ్రగాయాలయ్యాయి. బాపూజీ 17 ఏప్రిల్ 1941 అనగా ఛైత్రమాసం 6వ తిథిన, అప్పటి సింధురాష్ట్రంలో నవాబ్ జిల్లా బెరనీ గ్రామంలో జన్మించాడు. తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త తౌమల్ సిరుమలానీ, తల్లి మెహంగీబా. ఆ పిల్లవాడు పుట్టినరోజున ఒక వర్తకుడు వారి ఇంటికి వచ్చి, ఇక్కడ ఒక దివ్య ఋషి పుడతాడని నాకు బలమైన అనుభూతి కలిగిందని చెప్పి ఒక ఊయలను బహుమతిగా ఇచ్చారట. ఆసుమల్ ఆ ఇంటిలో ముగ్గురు ఆడపిల్ల తరువాత కలిగిన మొదటి మగసంతు. అలా గయితే అరిష్టమని ఒక మూఢ నమ్మకం ఉంది కాని ఆ బాలుని జననం తరువాత ఆ కుటుంబం ప్రతిష్ట, సంపద మరింతగా అభివృద్ధి చెందాయి.
ఆ బాలుని 3 సంవత్సరాల వయస్సులో వారి కులగురువు పరశురామ్జీ మహారాజ్ ఆ ఇంటికివచ్చి, బహిరంగంగా – ఈ బాలుడు సామాన్యుడు కాదు. భవిష్యత్తులో ఒక దివ్యభక్తుడు అవుతాడని, భగవద్జ్యోతిని అజ్ఞాన ప్రజలకు చూపిస్తాడని – చెప్పారు. బాలయమ్ నుండియే ఆసుమల్ ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపెవారు.తల్లి నుండి భగ్వథ్ గిత, రామాయణం తదితర గ్రంధాలు వినేవారు. అందరి మహాపురుషులు లాగీ తల్లితండ్రులు, పెద్దలు, గురువులు అంటే చాల నమ్రత, నమ్మకం, హృదయ పూర్వకంగా గురావ్ భావంగా వుండేది. ముఖర్జీ మెమోరియల్ గోల్డ్ మెడల్, 1954 : శిశిర్ కుమార్ మిశ్రా పురస్కారం. 1982 – 1990 : రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు.


