స్త్రీ హంస… మహా పాపం!
- 127 Views
- wadminw
- January 5, 2017
- Home Slider సంపాదకీయం
గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాం. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశం ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం. సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాం. ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది. పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు, ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటావ.
మరి ఈరోజు (నవంబర్ 25) అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాం… ”ఓ దేశ మహిళ స్థితిగతుల్ని చూసి ఆ దేశ పరిస్థితిని ఇట్టే చెప్పేయవచ్చును” అన్నారు పండిత జవహర్ లాల్ నెహ్రూ. నిజమే కదా. ఒక దేశ మహిళలు ఆ దేశ నాగరికతకు ప్రతిబింబం వంటి వారు. నాగరికత ఆరంభం అయిననాటి నుంచి భారతీయ మహిళలకు ఎంతో గుర్తింపు, ప్రాధాన్యత ఉన్నాయి. మన దేశంలోని గొప్ప మహిళల గురించి చరిత్ర పేర్కొంటుంది ఎన్నో విశేషాలు.
దేశ జనాభాలో దాదాపుగా సగం సంఖ్య వారిది. వివిద రూపాలలో జాతీయ, ఆర్ధిక పురోగతిలో మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. మహిళలు మంచి స్థాయిని అనుభవిస్తున్నట్లయితే అక్కడి సమాజం సరైన వికాసంతో, బాధ్యతతో ఉన్నదని అర్ధం. ప్రాచీన భారతంలో ఈ జీవితంలోని అన్ని కోణాల్లోనూ పురుషులతో సమంగా తమ స్థాయిని అనుభవించే వారు. పురుషులు మాదిరిగానే చదువుకునే వారు. గొప్ప పండితులు, కవయిత్రులు, ఫిలాసఫర్లుగా ఎదిగినవారూ ఉన్నారు.
ఒక్క మాటలో చెప్పలంటే స్త్రీ ఆ రోఉల్లో లక్ష్మీ దేవికి తీసిపోని స్థానాన్ని అనుభవించినది. అర్ధాంగిగా సంపూర్ణ పాత్ర పోషించేది. స్వయంవరం ద్వారా తన భర్తను ఎంఫికచేసుకునే స్వేచ్చ ఆనాటి మహిళలకు ఉండేవని పురాణాలు వలన మనకు అవగతం అవుతుంది. వైదిక యుగం తరువాత స్త్రీ స్థాయి తగ్గనారంభించింది. సమాజంలో లింగవివక్షత పాకడం మొదలైంది. మధ్య ప్రాచీన కాలం నాటికి మహిళ స్థితిగతుల్లో గణనీయమైన తేడాలొచ్చేశాయి.
నిజం చెప్పాలంటే స్త్రీ జీవితంలో చీకటికోణం మొదలైంది. అప్పుడే, నేటి సమాజంలో స్త్రీలు అనేక సామాజిక, ఆర్ధిక, రాజకీయం, విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గృహ హింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. అత్మనూనతా భావానికి లోనై స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటిన్నింటినీ అరికట్టే ప్రయత్నంలో 1999 డిసెంబరు 17వ తేదీన ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని చేసింది. ప్రతి సంవత్సరం నవంబరు 25న స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీ హింసా వ్యతిరేక దినంగా పాటించాలని ఈ తీర్మానం సారాంశం.


