10 కోట్ల కరోనా డోసులు వృథా
- 79 Views
- admin
- October 21, 2022
- అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు
సెకండ్ డోసు తీసుకున్న తర్వాత ప్రజలు బూస్టర్ డోసు తీసుకోవడానికి కొంత విముఖత చూపిస్తున్నారని సీరమ్ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. మొదటి, రెండో డోసుగా ఇతర కంపెనీల వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ బూస్టర్ డోసుగా ఏ కంపెనీ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చని ఆరోగ్య శాఖ సూచించిందన్నారు. అయినప్పటికీ కరోనా విషయంలో, వ్యాక్సిన్లు తీసుకోవడంపైనా జనం విసుగెత్తిపోయారని పేర్కొన్నారు. వాస్తవానికి తనకూ వీటిపై విసుగ్గానే ఉందని పూనావాలా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో కరోనా వ్యాక్సిన్లకు డిమాండ్ తగ్గిపోయిందని, ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లతో గోడౌన్లు నిండిపోయాయని వివరించారు. గతేడాది డిసెంబర్ నాటికి సీరమ్ కంపెనీ దగ్గర కొవిషీల్డ్ వ్యాక్సిన్లు పెద్ద మొత్తంలో నిల్వ ఉండిపోవడంతో వ్యాక్సిన్ ఉత్పత్తిని ఆపేశామని తెలిపారు. అప్పటికే సుమారు 10 కోట్ల కొవిషీల్డ్ డోసులు ఎక్స్ పైరీ అయ్యాయని అదర్ పూనావాలా వివరించారు.


