ప్రతీకారం తీర్చుకున్నారు…20 మంది మావోలను మట్టుబెట్టారు
- 14 Views
- admin
- May 17, 2017
- జాతీయం తాజా వార్తలు

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నారు. సీఆర్పీఎఫ్ దళాలపై ఆకస్మిక దాడితో హతమార్చిన మావోయిస్టులను సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు గట్టి దెబ్బకొట్టాయి. బీజాపూర్, రాయఘడ జిల్లాలోని అటవీ ప్రాంతం పరిధిలో సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సమయంలో సీఆర్పీఎఫ్ దళాలను ఏమార్చేందుకు కోబ్రా దళాలు ధరించే దుస్తులు ధరించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే వారు మావోయిస్టులని గుర్తించిన సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు విరుచుకుపడ్డాయి. దీంతో కాల్పులు చోటుచేసుకోగా, ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారని తెలుస్తోంది. మావోలను ఏరివేసేందుకు 350 మంది సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు, కోబ్రా దళాలు కూడా పాలుపంచుకున్నాయని సమాచారం.
Categories

Recent Posts

