విజయవాడ నుంచే బీజేపీ విజయ యాత్ర: షా
- 10 Views
- admin
- May 25, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దీమా వ్యక్తం చేశారు. గురువారం విజయవాడలో బూత్ కార్యకర్తల మహాసమ్మేళన్ పేరుతో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ‘విజయవాడ అంటే విజయానికి నిలయం. ఇక్కడి నుంచే బీజేపీ విజయానికి పునాదులు పడుతున్నాయి. ఇక్కడి నుంచే విజయప్రస్థానం మొదలవుతుంది. దక్షిణ భారతదేశంలో ఏపీ ప్రజలు మాకు విజయం అందిస్తారని విశ్వాసం మాకుంది. బూత్ స్థాయి సమావేశాలను విజయవంతం చేసిన శ్రేణులకు అభినందనలు. ఏపీలో 25వేల బూత్ ల నిర్మాణం జరగడం హర్షణీయం.
కార్యకర్తల కృషి ఫలితంగానే ఏపీలో పార్టీ సభ్యుల సంఖ్య పెరిగింది. బీజేపీకి దేశంలో వివిధ రాష్ట్రాల్లో 1,300లకుపైగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దీనికి కారణం కార్యకర్తలే. పార్లమెంటులో 330కిపైగా ఎంపీలు ఉన్నారు.
Categories

Recent Posts

