అద ష్టాన్ని పరీక్షించుకోవద్దు: భారత్కు చైనా హెచ్చరిక
- 20 Views
- admin
- July 24, 2017
- అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు
బీజింగ్: డోక్లాం సరిహద్దు వివాదం విషయంలో చైనా మిలటరీ శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేసి, సరిహద్దు యుద్ధంలో తమ అద ష్టాన్ని పరీక్షించుకోవద్దని భారత్ను చైనా హెచ్చరించింది. %–%పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో యుద్ధం కన్నా పర్వతాన్ని కదిలించడం సులువు%–% అంటూ చైనా ఆర్మీ ప్రతినిధి వూ కియాన్ భారత్కు హితబోధ చేశారు. ఒకప్పటితో పోలిస్తే చైనా మిలటరీ దళం బాగా అభివ ద్ధి చెందిందని ఆయన గుర్తుచేశారు. చైనా, భూటాన్, భారత్ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్డు మార్గం నిర్మించకుండా అడ్డుపడుతూ తమ భూభాగంలోకి భారత సైన్యం చొచ్చుకొస్తుందని చైనా ప్రతినిధి తెలియజేశారు. శాంతి చర్చలు జరపాలంటే ముందు భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించాలని ఆయన అన్నారు. ఒకవేళ అలా చేయకుండా ముందడుగు వేస్తే భారత్ తమ అదష్టాన్ని పరీక్షించుకోవడమే అవుతుందని కియాన్ హెచ్చరించారు. ”చైనా మిలటరీ గురించి తప్పుగా ఊహించుకోని భారత్ ముందడుగు వేయకుంటే మంచిది. అలాగే తమ తప్పు తెలుసుకుని మా అధికారులతో వీలైనంత త్వరగా శాంతి చర్చలు జరిపితే గానీ సరిహద్దు వద్ద పరిస్థితి మెరుగుపడదు” అని కియాన్ అన్నారు. ప్రస్తుతం 300 మందికి పైగా ఇరుదేశాల సైనికులు 150 కి.మీ.ల దూరంలో ఎదురెదురుగా నిల్చొని సరిహద్దు గస్తీ కాస్తున్న సంగతి తెలిసిందే!


