మరి కొందరు టీడీపీ వీడతారు
- 10 Views
- admin
- February 20, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
పార్టీని వీడుతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు———-
టికెట్ దక్కదని తెలిసి ఇప్పుడు పార్టీ మారుతున్నారు————-
ఒకరిద్దరు పార్టీ మారినంత మాత్రన పార్టీకి నష్టమేమీ లేదు————–
హోం మంత్రి చినరాజప్ప——————-
రాజమహేంద్రవరం, ఫీచర్స్ ఇండియా : టికెట్ రాదన్న భయంతోనే కొందరు టీడీపీని వీడుతున్నా రంటున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. పార్టీని వీడుతామని ఆరు నెలలుగా వారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. చివరికి టికెట్ దక్కదని తెలిసి పార్టీ మారారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన రాజప్ప.. టీడీపీ నుంచి వైసీపీకి వలసలపై స్పందించారు. తూర్పుగోదావరి జిల్లాలో మరో ఇద్దరు, ముగ్గురు నేతలు పార్టీని వీడే అవకాశముందన్నారు రాజప్ప. తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోటని.. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామన్నారు.
ఒకరిద్దరు వెళ్లినంతమాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని.. పార్టీ వీడినవారి స్థానంలో వచ్చే ఎన్నికల్లో సమర్థులే టీడీపీ నుంచి బరిలోకి దిగుతార న్నారు. గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్యను కాపాడేందుకు పోలీసులు అన్నివిధాలా ప్రయత్నించారన్నారు హోంమంత్రి. అలాంటి పోలీసులపై వారే చంపారని నిందలు వేయడం సరికాదన్నారు. చంపడం, శవ రాజకీయాలు చేయడం వైసీపీ, బీజేపీల విధానమని మండిపడ్డారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటీ రాజీ లేదన్నారు.


