గెలుపు గుర్రాలనే నిలబెడుతున్నాం
- 11 Views
- admin
- February 25, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
రాష్ట్రాన్ని మరో బిహార్ చేయడానికి కుట్ర———-
ఏపీపై ద్వేషంతో కేసీఆర్ జగన్పై ప్రేమ చూపుతున్నారు———-
రాష్ట్రంలో సామంతరాజు పాలన తేవాలన్నదే వారి ఆలోచన——–
సీఎం చంద్రబాబు మండిపాటు——————
విజయవాడ, ఫీచర్స్ ఇండియా : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా రని టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నేడు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీపై ద్వేషం చూపిన కేసీఆర్, కేటీఆర్లు జగన్పై ప్రేమ చూపుతున్నా రని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో సామంతరాజు వ్యవస్థను తీసుకురావాలన్నదే వారి ఆలోచన అని చంద్రబాబు మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్లు రూ.1000 కోట్ల ప్యాకేజీతో కుట్రలు ప్రారంభిం చారని.. చంద్రబాబు ఆరోపిం చారు. రాష్ట్రాన్ని మరో బీహార్ చేసేందుకు ప్రశాంత్ కిషోర్ సాయంతో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కులరాజకీయాలను ఏపీ ప్రజలంతా వెలి వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర సమగ్రా భివద్ధే టీడీపీ లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివద్ధినీ, ప్రజల మంచిని కోరుకునేవారు టీడీపీలో చేరుతు న్నారని.. అవినీతిని కాంక్షించేవారు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని చంద్రబాబు చెప్పారు. ఇప్పటి వరకూ 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తి చేసుకు న్నామని.. గెలుపు గుర్రాలపై అభ్యర్తులుగా నిల బెడుతు న్నామని ఆయన తెలిపారు. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యేక పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు.


