ఏదో త్యాగం చేసినట్లు మాట్లాడుతున్నారు
- 7 Views
- admin
- March 2, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
మోడీకి దేశభక్తి కంటే రాజకీయ భక్తి ఎక్కువ—————-
స్వార్థం కోసం దేశాన్ని పణంగా పెట్టే వ్యక్తి ప్రధాని—————-
కేసీఆర్, జగన్, మోడీ ముసుగులు తొలగించి పోటీ చేయాలి——————–
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు———–
అమరావతి, ఫీచర్స్ ఇండియా : వైకాపాకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా దొంగ ఓట్లుగా చిత్రీకరించి వారి పేర్లను తొలగించే ప్రయత్నం చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లను తొలగించే కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ నేతలతో ఆయన శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
డివిజన్ లేని మాయా జోన్ ప్రకటించి ఏదో త్యాగం చేసినట్లు మోదీ మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ప్రధానికి దేశభక్తి కంటే రాజకీయ భక్తి ఎక్కువని, స్వార్థం కోసం దేశాన్నే పణంగా పెట్టే వ్యక్తి మోదీ అని వ్యాఖ్యానించారు. మనల్ని తిట్టడానికే విశాఖ వచ్చారని విమర్శించారు.
అవినీతిపరులపై చర్యలు తీసుకుంటానన్న మోదీ.. జగన్తో ఎలా జట్టు కట్టారని ప్రశ్నించారు. బిహారీ ప్రశాంత్ కిషోర్ని మోదీ- జగన్ తమ కన్సల్టెంట్గా పెట్టుకుని రాష్ట్రాన్ని మరో బిహార్ చేద్దామనే కుట్రను పన్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారి కుట్రలను జరగనివ్వబోమన్నారు. కేసీఆర్-మోదీ-జగన్ ధైర్యం ఉంటే ముసుగు తొలగించి రాష్ట్రంలో పోటీ చేయాలన్నారు. రాష్ట్ర భవిష్యత్ ఆకాంక్షించే వ్యక్తులంతా తెదేపాలో చేరుతున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని చేరికలుంటాయని తెలిపారు. ప్రజల మనోభావాలకు తగ్గట్లే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, దీనిపై కొందరు క్రమశిక్షణ తప్పి గోల చేయడం సరికాదని పేర్కొన్నారు.


