ఏపీలో ఎన్నికలు ఆపాల్సిందే !
- 15 Views
- admin
- March 8, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం వంటిల్లు స్థానికం
ఈసీకి తలనొప్పులు తెస్తున్న ఆంధ్రా రాజకీయం——————–
ఓటరు లిస్టులో మార్పులు సరిదిద్దుతారా?—————
అక్రమార్కులకు ఇదే అవకాశం————
ఎన్నికలు ఆపాలని అభ్యర్థనలు————–
ప్రత్యేక ప్రతినిధి, ఫీచర్స్ ఇండియా : ప్రస్తుతం ఏపీ ఎన్నికల జాబితాలో బోలెడు తప్పులు తడకలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. చెప్పాలంటే లక్షల్లో ఓట్లు గల్లంతు అయ్యాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఓటు కూడా గల్లంతు అయిందంటే అంత కంటే దారుణం వేరోకటి లేదు. ఇక వైసీపీ అధినేత జగన్ సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి ఓటు కూడా తొలగించారని చెబుతున్నారు. అంటే పెద్ద వాళ్ళకే దిక్కులేని ఈ పరిస్థితుల్లో ఈ జాబితాను పెట్టుకుని రేపటి ఎన్నికల్లోకి వెళ్తే పరిస్థితి ఏమిటని రాజకీయ విశ్లేషకులు, మేధావులు తలలు పట్టుకున్నారు.
మార్పులు చేర్పులు : ఓ వైపు చూస్తే ఎన్నీల షెడ్యూల్ వచ్చేస్తోంది. ఇంకోవైపు చూస్తే దాదాపు 55 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు అయ్యాయని ప్రధాన పార్టీ వైసీపీ ఆరోపణ చేస్తోంది. ఇక రాజకీయ పార్టీలతో సంబంధం లేని వారు, తటస్తులు లక్షల్లో తమ ఓట్లు పోయాయని చెబుతున్నారు. వాటిని సరి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఉన్నది చూస్తే తక్కువ సమయం. ఓ వైపు డేటా చోరీ హడలెత్తిస్తోంది. ఇప్పటికే కొన్ని ఏళ్ళుగా ప్లాన్గా ఓటర్ల పేర్లు గల్లంతు చేస్తూ వస్తున్నారన్న రాజకీయ ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. మరి వీటిని సరిదిద్దే పరిస్థితి ఉందా.
ఎవరికి లాభం : ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయకుండా ఎన్నికలకు వెళ్తే అక్రమా ర్కులకే అవకాశాలు ఉంటాయన్నది నిజం. తెలంగాణా ఎన్నికల వేళ లక్షల్లో ఓట్లు పోయాయి. చివరి నిముషంలో తెలుసుకుని ఏం చేయలేకపోయారు. ఇపుడు ఏపీ వంతు వచ్చింది. మరి దాన్ని సరిచేసేందుకు సమయం ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఎన్నికల నోటిఫికే షన్ వచ్చిన తరువాత పూర్తిగా అధికారులు బిజీ అయిపోతారు. ఏదో తూతూ మంత్రంగా కొన్ని ఓట్లు చేర్చినా కూడా అన్యాయం న్యాయం అయిపోదు.
ఎన్నికలు ఆపాలా : అందువల్ల ఇపుడున్న పరిస్తితుల్లో కరెక్ట్ ఓటర్ల జాబితా వచ్చేంత వరకూ ఎన్నికలను కొంత కాలం వాయిదా వేయడం మంచిదేమో. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా పవిత్రమైనది. అదే ఆయుధం కూడా. అటువంటి హక్కులు లాగేసుకునే చర్యలు దారుణాతిదారుణం. మరి ఆ విధంగా చూసుకుంటే ఇప్పటికే తప్పుడు ఓట్లు, దొంగ ఓట్లు, డబుల్ ఓట్లుతో జాబితాలో అసలు నిజాయతీ లేదని ఆరోపణలు ఉన్నాయి. దాన్ని మార్చేందుకు యుద్ధ ప్రాతిపదిక విూద చర్యలు తీసుకోవాలి. ఈ లోగా ఏపీలో పాలనను గవర్నర్కి అప్పగించి అన్ని రాజకీయ పక్షాల విశ్వాసం తీసుకున్న విూదటనే ఎన్నికలకు వెళ్తేనే ప్రజాస్వామ్యానికి అసలైన అర్ధం, సార్ధకత లభిస్తాయి. మరి ఆ దిశగా ఆలోచన చేయాలని మేధావులు కోరుతున్నారు.
ఈసీకి తలనొప్పులు: ఏపీలో రాజకీయం ఎన్నికల అధికారులను సైతం ఇబ్బంది పెడుతోంది. ఓట్లు తొలగింపు కోసం ఫాం 7 దరఖాస్తుల వ్యవహారం ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారింది. ఓట్లను తొలగించాలంటూ చేసిన దరఖాస్తుల్లో దాదాపు లక్షా 55 వేల పైచిలుకు నకిలీ దరఖాస్తులు వచ్చినట్టుగా ఎన్నికల సంఘం పరిశీలనలో తేలింది.
మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 8.7 లక్షల దరఖాస్తుల పరిశీలన విడతల వారీగా చేపడుతున్నామని ఈసీ స్పష్టం చేస్తోంది. తొలివిడతగా 1 లక్షా 61 వేల 5 దరఖాస్తులను పరిశీలించిన ఎన్నికల సంఘం అందులో అసలైనవి 5 వేల 309గా తేల్చింది. మిగతావి దురుద్దేశ పూర్వకంగా వచ్చిన ఫాం 7 దరఖాస్తులుగా గుర్తించింది.
లక్షా 55 వేల 696 దరఖాస్తులు దురుద్దేశ పూర్వకంగా దాఖలైన నకిలీ దరఖాస్తులుగా గుర్తించి తిరస్కరించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. జనవరి 11 తర్వాత రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా తొలగించలేదని ఈసీ స్పష్టం చేస్తోంది. ఫాం 7 ఆన్ లైన్ లో దరఖాస్తు చేయగానే ఓటు తొలగించినట్టు కాదని ఈ అంశాన్ని ప్రజలు, రాజకీయ పార్టీలు గుర్తించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈసీ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయించటం మొదలు పెట్టగానే ఫాం 7 దరఖాస్తులు నిలిచి పోయాయని అధికారులు వెల్లడిస్తున్నారు. రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం కూడా సరికాదని ఈసీ ఫైర్ అవుతోంది. పొలిటికల్ పార్టీలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని అధికారులు మండిపడుతున్నారు.


