జగన్ తెరాసకు డమ్మీ !
- 15 Views
- admin
- March 8, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కుట్రలు చేస్తున్నారు————-
తెలుగు తల్లిని అవమానించిన కేసీఆర్తో జగన్కు దోస్తీ ఏంటీ !?————-
వైసీపీకి కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నారు—————-
రాష్ట్ర ప్రతిష్ట కోసం కష్టపడుతున్నాను—————
అప్రతిష్ట చేయడానికి జగన్ కుట్రలు—————-
టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు వ్యాఖ్యలు——————–
అమరావతి, ఫీచర్స్ ఇండియా : రాష్ట్రానికి పెట్టు బడులు రాకుండా వైకాపా, తెరాస, భాజపా కుట్రలు పన్నుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శిం చారు. ఏపీ యువత ఉపాధికి గండికొట్టేందుకే ప్రయత్ని స్తున్నాయని దుయ్యబట్టారు. వైకాపాకి అధ్యక్షుడు కేసీఆర్ అని.. వైకాపా, తెరాసకు సంయుక్త వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారని ఎద్దేవాచేశారు. జగన్ను తెరాసకు డమ్మీగా చేశారని విమర్శించారు. ఆంధ్రాపై నిలువెల్లా ద్వేషంతో కేసీఆర్ కుటుంబం ఉందని, దీనికి ఆ పార్టీ నేతల వ్యాఖ్యలే రుజువని స్పష్టంచేశారు. తెలుగుతల్లిని అవమానించిన కేసీఆర్తో జగన్కు దోస్తీ ఏంటని ప్రశ్నిం చారు. ముందు కేసీఆర్ పెట్టుబడి పెడతారు.. తరువాత జగన్ కప్పం కడతారంటూ విమర్శించారు. ఈ మేరకు పార్టీ నేతలతో శుక్రవారం సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వ హించారు. నిస్సిగ్గుగా వైకాపా దొంగ పనులు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. తెరాసకి డబ్బులు బాగా చేరాయని, అందుకే వైకాపాకి కేసీఆర్ ఎదురు పెట్టుబడులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెదేపా అభ్యర్థులను బెదిరించే భాజపా నీచ కుట్రలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారని సీఎం అన్నారు. తెదేపా సమాచారం చోరీపై ప్రత్యేక దర్యాప్తు బ ందం ఏర్పాటైందని, ఓట్ల తొలగింపు కుట్ర లోగుట్టును ఛేదిస్తామని స్పష్టంచేశారు. ఈ 10 రోజుల్లోనే రాష్ట్రానికి 45వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. రాష్ట్ర ప్రతిష్ఠ కోసం తాను కష్టపడుతుంటే, అప్రతిష్ఠ తెచ్చేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు.
వైకాపాకు మహిళలే బుద్ధి చెప్పాలి..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల్లో ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం పెంచామని పేర్కొన్నారు. ప్రతి డ్వాక్రా మహిళ ఖాతాలో ఈ రోజే రూ.3,500 జమ చేసుకునే వీలు కల్పించా మని, బోగస్ చెక్కులని అన్న వైకాపాకు మహిళలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ 3రోజులు అన్నిచోట్లా ర్యాలీలు, సభలు నిర్వహిం చాలన్నారు. దొంగలను నమ్మం అని మహిళలంతా సంకల్పం చేయాలన్నారు.


