జగన్ కేసుల మాఫీయే మోదీ దడ సంకల్పమా
- 9 Views
- admin
- April 4, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ అడ్డకునేందుకు దుష్ట ప్రయత్నాలు———————
డమ్మీ ఈవీఎంలను కూడా నియోజకవర్గాల్లోకి దించుతున్నారు———–
టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు——————
అమరావతి, ఫీచర్స్ ఇండియా : వైసీపీ వ్యాపారు లపై.. టీఆర్ఎస్ కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు చేయరా అని ప్రశ్నించారు చంద్రబాబు. గురువారం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్ర బాబు.. ఎన్నికల వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ టీడీపీ, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీలనే బీజేపీ టార్గెట్ చేస్తోం దన్నారు. జగన్ కేసుల మాఫీయే మోదీ దడ సంకల్పం.. అందుకే జగన్ కంటికి మోదీ దడ చిత్తం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
ఎన్నికల సమయంలో ఐటీ దాడులు, పాత కేసుల్ని తిరగతోడి టీడీపీని టార్గెట్ చేశారంటున్నారు టీడీపీ అధి నేత చంద్రబాబు. ముగ్గురు దుర్మార్గు లు ఏకమై ముప్పేట దాడికి దిగా రని.. రాష్ట్రవ్యాప్తంగా అలజడులు సష్టిస్తూ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిం చారు. కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగు తున్న వరుస
ఘటనలే దీనికి ఉదాహరణన్నారు. మోదీ, కేసీఆర్,జగన్లు రాష్ట్రంపై ముప్పేట దాడులు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. కక్షసాధింపుతో టీడీపీ నేతలపై మోదీ ఐటీ దాడులు చేయిస్తున్నారని.. పార్టీ నేతలపై ఉన్న పాత కేసుల్ని కేసీఆర్ బయటకు తీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంపై ఎన్ని కుట్రలు చేయాలో.. అన్ని కుట్రలు చేస్తున్నారంటున్నారు. ఓటమి భయంతోనే ముగ్గురు కలిసి బీసీ నేతల్ని టార్గెట్ చేశారంటున్నారు. మొన్న బీద మస్తాన్ రావు… నిన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇళ్లపై దాడులే ఉదహరణన్నారు. వైసీపీ వ్యాపారులపై.. టీఆర్ఎస్ కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు చేయరా అని ప్రశ్నించారు చంద్రబాబు. బీజేపీ టీడీపీ, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీలనే బీజేపీ టార్గెట్ చేస్తోందన్నారు. జగన్ కేసుల మాఫీయే మోదీ ద డ సంకల్పం.. అందుకే జగన్ కంటికి మోదీ దడ చిత్తం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ అడ్డకునేందుకు దుష్ట ప్రయత్నాలు చేశారని.. డమ్మీ ఈవీఎంలను కూడా నియోజకవర్గాల్లోకి దించుతున్నారని ఆరోపించారు. ఓటర్లకు కూపన్ కార్డులు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో వైసీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయంటున్నారు చంద్రబాబు.చంపడమో, చావడమో అంటూ వైసీపీ నేతలు రెచ్చగొడు తున్నారని.. మైలవరంలో పోలీసులు, జవాన్లపై వైసీపీ కార్యకర్తలు చెప్పులు, రాళ్లతో దాడులు చేయడం దారుణమన్నారు. గ్రామాల్లో దారి మూసేస్తామని.. గుడిసెలు పీకేస్తామని పుంగనూరులో బెదిరింపులకు దిగుతున్నాని ఆరోపించారు. పొన్నూరులో స్కూల్ పిల్లల ఆటోపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేయడం దుర్మార్గమన్నారు. చివరికి అద్దెకు ఉండే వాళ్లను అర్ధరాత్రి ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో గర్భిణి మహిళను జుట్టుపట్టుకుని ఈడ్చటం… వ ద్ధులనే కనికరం లేకుండా అర్ధరాత్రి సామాన్లు బయట పడేశారన్నారు.
వైసీపీ దౌర్జన్యాలు చూస్తుంటే.. వైసీపీకి ఓటేస్తే మన ఇళ్లలోనే మనం అద్దెకు ఉండాల్సి వస్తుందేమోనన్నారు. వైసీపీ కుట్రలు, దౌర్జన్యాలకు నిరసనగా ప్రతి రోజూ గంటసేపు ర్యాలీలు చేపట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ ఏజెంట్లను కొంటామని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని.. కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ పార్టీని కాపాడుకోవాలని.. ఆంధ్రుల సత్తా ఏంటో మోదీకి, కేసీఆర్లకు తెలియజేయాలన్నారు. కూడా రుచి చూపించాలన్నారు.


