రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేరు: మేనకా గాంధీ
- 15 Views
- admin
- April 6, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పటికీ దేశ ప్రధాని కాలేరని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీ అన్నారు. ఎదైనా అద్భుతం జరిగితే తప్ప రాహుల్ ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ అమేథి, వయానంద్ నుంచి పోటీచేయడం ఆమె స్పందించారు. ఎన్నికల్లో ఎవరైనా రెండు సీట్లలో లేదా అంతకన్నా ఎక్కవ స్థానాల నుంచి పోటీచేయొచ్చని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రభావం ఏవిూ ఉండదని ఆమెకు కార్యకర్తల బలం లేదని తెలిపారు. సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపుపై ఆమె ధీమా వ్యక్తం చేశారు. నా భర్త సంజయ్ గాంధీ రెండు సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వరుణ్ గాంధీ గెలుపొందారు. ఈసారి నాతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సారి కూడా విజయం మాదే. ఉత్తర్ప్రదేశ్లో ఎస్పీ-బీఎస్పీ కూటమితో ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తామే మెజార్టీ స్థానాల్లో గెలవబోతున్నామన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిపై మేనకా మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మాయావతి బీఎస్పీ పార్టీ గురించి మనందరికీ తెలుసు. డబ్బు కోసం ఆమె టికెట్లు అమ్ముకుంటున్నారు. కొన్నేళ్లుగా మనమంతా ఈ వ్యవహారాన్ని చూస్తూనే ఉన్నాం. ఈసారి సుల్తాన్పూర్ టికెట్ను రూ.15కోట్లకు అమ్ముకుందని మేనకా గాంధీ ఆరోపించారు. 2014 ఎన్నికల్లో పిల్బిట్ నుంచి గెలిచిన మేనకా తన తనయుడు వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న సుల్తాన్పూర్ నుంచి ఈసారి బరిలో దిగుతున్నారు. పిల్బిట్ నుంచి కాకుండా సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.


