చిన్నమ్మ రూ. 100 కోట్ల ఆస్తులు సీజ్
తమిళనాడులోని పయనూర్ గ్రామంలోని 24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు చెందిన ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. యలలిత ముఖ్యమంత్రిగా ఉన్న 1991-1996 మధ్యకాలంలో ఈ ఆస్తులను శశికళ కొనుగోలు చేశారు. ఈ ఆస్తులను కొనుగోలు చేసే సమయంలో వాటి విలువ రూ. 20 లక్షల వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు వాటి విలువ దాదాపు రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆమెకు చెందిన 11 ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద ఐటీశాఖ బుధవారం ఆస్తులను సీజ్ చేసింది. 2014లో కర్ణాటక స్పెషల్ కోర్టు జడ్జి జాన్ మిఖాయెల్ కున్హా ఈ ఆస్తులను అక్రమాస్తులుగా నిర్ధారిస్తూ తీర్పును వెలువరించారు. ఆ అక్రమాస్తులు జయలలిత, శశికళకు చెందినవని తెలిపారు. ఆనాటి కోర్టు తీర్పును అనుసరించి బినామీ నిరోధక చట్టం కింద ఐటీశాఖ బుధవారం ఆ ఆస్తులను సీజ్ చేసింది. ఆస్తులు ఉన్న ప్రాంతంలో వాటిని సీజ్ చేసినట్టు నోటీసులు అతికించారు.


