స్టీల్ప్లాంట్పై పవన్ పోరాటం .. నమ్మకం లేదు
గత 222 రోజులుగా స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం జరుగుతుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కనపడలేదా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఢల్లీిలో చేసిన ఆందోళనకు వైసీపీ వచ్చింది కానీ, మీరు రాలేదని విమర్శించారు. ఢల్లీిలో మీకు పలుకుబడి ఉన్నప్పటికీ… మీరు గట్టిగా వారిని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో ఇక్కడ గుద్దులాట, అక్కడ ముద్దులాటా ? అని విమర్శించారు. చేతకాకపోతే చెప్పాలని, ప్రజలను మాత్రం మోసం చేయవద్దని కోరారు. రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండాలంటే కచ్చితంగా పోరాడాల్సిందేనని నారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం సాధ్యమేనని చెప్పారు. ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఉందని అన్నారు. ఈ అంశంపై వెంకయ్యనాయుడు స్పందించాలని కోరారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్పై పవన్ కల్యాణ్ చేసే పోరాటంపై తమకు నమ్మకం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.


