ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు
- 33 Views
- admin
- June 28, 2022
- తాజా వార్తలు రాష్ట్రీయం
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సోమ హత్య కేసు నిందితులు కూడా ఉన్నట్టు సమాచారం. వీరిలో 27 మంది మిలీషియా సభ్యులు కాగా.. మరో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు. కోరుకొండ, పెదబయలు దళాలకు చెందిన మావోలు లొంగిపోయారు. ఇంత పెద్ద సంఖ్యలో మావోలు లొంగిపోవడం గత పదేళ్ల కాలంలో ఇదే తొలిసారి. మరోవైపు మావోయిస్టుల డంప్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు డీఐజీ హరికృష్ణ, ఎస్పీ సతీశ్ తెలిపారు. ఇందులో రూ. 39 లక్షల నగదు, 9 ఎంఎం పిస్టల్, 2 ల్యాండ్ మైన్లు, బ్యాటరీలు, వైర్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. దీంతో ఏపీలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Categories

Recent Posts

