లక్షకు చేరుకున్న యాక్టివ్ కేసులు!
- 18 Views
- admin
- June 29, 2022
- జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
మరోవైపు దేశంలో యాక్టివ్ కేసులు లక్షకు చేరువయ్యాయి. ప్రస్తుతం దేశంలో 99,602 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,34,33,345కి పెరిగింది. వీరిలో 4,28,08,666 మంది కోలుకోగా.. 5,25,077 మంది మృతి చెందారు. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 4.33 లక్షల మందికి కొవిడ్ పరీక్షలను నిర్వహించగా… 14,506 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అంతకు ముందు రోజు 11,793 కేసులు రావడం గమనార్హం. ఇదే సమయంలో 11,574 మంది కరోనా నుంచి కోలుకోగా.. 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 3.38 శాతంగా, రికవరీ రేటు 98.56 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.23 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 197.46 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.
Categories

Recent Posts

