21 నుంచి స్కూళ్లు
- 106 Views
- admin
- September 7, 2020
- Home Slider రాష్ట్రీయం స్థానికం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 21 నుండి 9, 10, ఇంటర్ విద్యార్థుల కాలేజీుల, స్కూళ్లకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనికి తల్లిదండ్రుల రాత పూర్వకంగా అంగీకారం తప్పని సరిగా ఉండాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ఈ నె ల21 నుంచి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పీహెచ్ డీ, పీజీ విద్యార్థులకు అనుమతి ఇచ్చారు. సెప్టెంబర్ 21 నుంచి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, స్పోర్ట్స్, మత పరమైన, పొలిటికల్ సమావేశాలకు అనుమతి ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 20 నుంచి పెళ్ళిలకు 50 మంది అతిథులతో అనుమతి.. ఇటు అంతక్రియకు 20 మందికి అనుమతి ఇస్తారు. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్లకు మాత్రం అనుమతి నిరాకరించారు. ఇక సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఎయిర్ థియేటర్స్కు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అన్లాక్ 4 మార్గ దర్శకాను విడుదల చేసింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ లాక్ 4 మార్గదర్శకాతో ఉత్తర్వుల జారీ అయ్యాయి.


